KNR: ఎంపీ లాడ్స్ నిధులతో సమకూర్చిన డ్రిల్లింగ్ మిషన్లను శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బల్దియాకు అందజేశారు. కరీంనగర్ పరిధిలోని ప్రశాంత్ నగర్ వడ్డెర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో డ్రిల్లింగ్ మిషన్లు దగ్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు డ్రిల్లింగ్ మిషన్లు పంపిణీ చేసినట్లు ఎంపీ తెలిపారు.