AP: తమది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు అన్నారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలను చేపడుతున్నామని, 64 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిందన్నారు. కొంతమందికి పని చేసే చోటే పింఛన్లు ఇస్తున్నామని, ఉద్యోగుల తరహాలోనే పేదలకు పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.