HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా’లను రైల్వేశాఖ ఏర్పాటు చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్డా, ఢిల్లీ, ముంబయి, ధనపూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్నూ ఎంపిక చేసింది. ప్రస్తుతం రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను ఆధునికీకరిస్తున్న సంగతి తెలిసిందే.