GNTR: తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీ, కఠెవరం, నందివెలుగు గ్రామాల్లో శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారన్నారు.