SRD: సదాశివపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 34 మందికి 9.04 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆంజనేయులు నాయకులు సుధీర్ రెడ్డి, రత్నాకర్, వీరేశం, విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.