PDPL: కల్వ శ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభించినట్లు మండల విద్యాధికారి మహేష్ తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం అందించే పాఠ్య పుస్తకాలను అన్ని పాఠశాలకు శనివారం మండల విద్యా వనరుల కేంద్రంలో పంపిణీ చేపట్టారు. ఇప్పటికే నోటు పుస్తకాలు అన్ని పాఠశాలలకు అందించినట్లు తెలిపారు.