VZM: భోగాపురం మండల కేంద్రంలో కూటమి ప్రభుత్వం తరపున పింఛన్లను జనసేన నేతలు శనివారం పంపిణీ చేశారు. భోగాపురం సీనియర్ నాయకులు పల్లంట్ల జగదీష్, పల్ల రాంబాబు, వెంకటేష్, తదితరులు లబ్దిదారులకు పింఛన్ల సొమ్ము అందజేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని వాళ్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలతో దూసుకుపోతుందన్నారు.