ASR: వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రేగం చాణక్య నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడైన రేగం చాణక్య పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీలో పదవి లభించింది. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చాణక్య శనివారం మీడియాకు తెలిపారు.