సత్యసాయి: హిందూపురం పట్టణం అహమ్మద్ నగర్లో మున్సిపల్ చైర్పర్సన్ డీఈ రమేష్ శనివారం పర్యటించారు. వార్డు పర్యటనలో భాగంగా రోడ్లు, కాలువలు, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, నీటి సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అహమ్మద్ నగర్లో డంప్ యార్డ్లోకి వ్యర్థాలు వేయడం వలన విపరీతమైన వాసన వస్తుందని సమస్య పరిష్కరించాలని ప్రజలు విన్నవించారు.