W.G: జిల్లా వ్యాప్తంగా నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఇంటికి వెళ్ళి మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ అందజేశారు. రాష్ట్రం ఆర్థిక లోటుతో ఇబ్బందులు పడుతున్నా, ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని మంత్రి అన్నారు.