KMM: పాల్వంచ కిన్నెరసాని గురుకులలో శనివారం నిర్వహించిన ఆదివాసి సమ్మేళన కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు వేసిన సాంప్రదాయం నృత్యాలను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే.. ఆదివాసి జాతి గొప్పతనం, వారి జీవన శైలి, వారి జీవన మనుగడలో వచ్చిన మార్పులు, ప్రజా ప్రభుత్వం ఆదివాసీలకు చేసిన సహాయ సహకారాలు అంశాలపై మాట్లాడారు.