AKP: చోడవరం మండలం కన్నంపాలెంలో ఉపాధి నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని ఎంపీడీవో సీతారామస్వామి బుధవారం తనిఖీ చేశారు. గ్రామంలో కల్లా వారి పొలాల నుంచి స్మశానం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.