VSP: తెలంగాణలో అదృశ్యమైన యువతి శ్రావణిని విశాఖ టూ టౌన్ పోలీసులు గుర్తించారు. ఖానాపూర్కు చెందిన ఆమె డాబాగార్డెన్స్లో ఉన్నట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించి పోలీసులు ఆమెను కనుగొన్నారు. యువతి ప్రేమ వివాహం కోసం విశాఖకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసు చేధనలో విశాఖ పోలీసుల సేవలను తెలంగాణ పోలీసులు ప్రశంసించారు.