PPM: అర్హులైన దివ్యాంగులకు వారి అవసరాల మేరకు ప్రభుత్వం తరపున సహాయక ఉపకరణాలను అందజేస్తున్నామని కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా, పెద గుడబకు చెందిన భాగ్య లక్ష్మికి వీల్ ఛైర్, అలాగే వెంకటరాయుడు పేటకు చెందిన డి. లక్ష్మణరావుకు బ్లైండ్ స్టిక్ను కలెక్టర్ పంపిణీ చేశారు.