కాట్రేనికోన, చెయ్యరు జడ్పీ ఉన్నత పాఠశాలలను అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించి విద్యార్థులకు ఉన్న సామర్ధ్యాల గురించి వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు పోటీ తత్వంతో చదవాలన్నారు.