AKP: ఎలమంచిలి మండలం పెద్దపల్లిలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా వేద పండితులు విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు.