E.G: రాజమహేంద్రవరంలో ఆదివారం మహాదున్ను సభను నిర్వహిస్తామని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరంలోని లాలాచెరువు వద్ద మహాదన్ను సభను పురస్కరించుకొని దివంగత నాయకుడు దొమ్మేటి వెంకట్రెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.