ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో జేసీ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లే అవుట్ అప్రూవల్ నిమిత్తం పెండింగ్లో ఉన్న పలు సర్వే నెంబర్లను జేసీ కల్పనకుమారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. జేసీ వెంట అద్దంకి ఆర్డీవో, ఇతర మండలాల ఎమ్మార్వోలు, సర్వేయర్లు ఉన్నారు.