PPM: ప్రపంచ శాంతికి అహింస ఒక్కటే మార్గమని చాటిన మహాత్మా గాంధీ, వినోబా భావేల ఆశయాలు నేటికీ సజీవమని “భూదాన్ స్మృతి విచార్, సద్భావనా యాత్ర” నిరూపిస్తోంది. మహారాష్ట్రలోని పావనార్ ఆశ్రమం నుండి తెలంగాణలోని పోచంపల్లి వరకు సాగుతున్న ఈ యాత్ర మన్యం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మందిరంలో జరిగిన ఆత్మీయ సమావేశం పార్వతీపురంలో నిర్వహించారు.