సత్యసాయి: అమడగూరు మండలం కొట్టువారిపల్లి వద్ద పోలీసులు బుధవారం నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏడుగురు పేకాటరాయులు పట్టుబడ్డారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డ్రోన్ కెమెరా సాయంతో నిఘా ఉంచి ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితుల నుంచి రూ. 2.54 లక్షల నగదు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.