GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలో మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అందరి బాధ్యతని, అన్యాయం జరిగితే ధైర్యంగా స్పందించి పోలీసుల ‘శక్తి టీమ్’ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.