KKD: జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిర్వహణ జరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం రాత్రి తెలిపారు. జిల్లాలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నీటి సంఘం ఎన్నికలను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించేందుకు కృషి చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు.