TPT: సూళ్లూరుపేట మండలం కే.సీ.యన్ గుంటకు చెందిన తుమ్మ వెంకటరమణయ్య మరణించగా, ఆయనకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యాక్టివ్గా ఉండటంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. కెనరా బ్యాంకు ద్వారా క్లెయిమ్ చేసి రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని ఆయన భార్య సుప్రియకు అందజేశారు. తిరుపతి సర్కిల్ అధికారుల చేతుల మీదుగా ఈ చెక్కు అందించారు.