అన్నమయ్య: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని తిరుమల, వంశీకృష్ణ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారంతో సీఐలు శివన్న, శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి గురువారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 5 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు తెలిపారు.