KRNL: పెద్దకడబూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఇవాళ అట్టహాసంగా జరిగింది. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు పింఛన్ల కోసం రూ.3వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.