TPT: శ్రీసిటీలోని డానియెలి ఇండియా లిమిటెడ్ సీఐఐ ఇండస్ట్రియల్ సేఫ్టీ అవార్డ్స్-2025లో గోల్డ్ అవార్డు అందుకుంది. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఉత్తమ భద్రతా ప్రమాణాలు, పని సంస్కృతి ఆధారంగా సీఐఐ నిపుణుల కమిటీ సంస్థను ఎంపిక చేసింది. ఈ అవార్డు సంస్థ భద్రతా నిబద్ధతకు నిదర్శనమని సీఓఓ పి.శ్రీనివాస్ రావు తెలిపారు.