తిరుపతి: విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు చేయూతనందించారు. హోంగార్డు రమేష్ బాబు భార్య వసంతమ్మకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ అపాయింట్మెంట్ లేఖ అందజేశారు. అలాగే ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో ఇచ్చారు.