సత్యసాయి: భారత అంధ మహిళల టీ-20 క్రికెట్ కెప్టెన్ దీపికకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అండగా నిలిచారు. అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన దీపిక నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు హేమావతి గ్రామంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. మంగళవారం దీపిక కుటుంబ సభ్యులకు స్థల పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యేకు దీపిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.