E.G: అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని.. ట్రంప్కు మోదీ బానిసగా మారారని CPI జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు.