TPT: తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినం తిరుమలలో వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తుంబురు తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.