కడప: నగరంలోని ఆర్టీసీ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. వీకెండ్ కావడంతో ఇంట్లోని వారు స్వగ్రామానికి వెళ్ళగా ఇంట్లో దొంగలు చొరబడి బంగారు, నగదును దోచుకెళ్ళారు. ఇంటి వాకిలి తెరిచి ఉండడంతో ఆదివారం ఉదయం స్థానికులు ఫోనులో ఇంటి వారికి తెలుపగా.. వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని చిన్నచౌక్ పోలీసులకు చేరవేశారు.