కడప: నగర 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మ ఇటీవల వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి సహకరించాలని సీఎం సూచించారు.