సత్యసాయి: పుట్టపర్తి లోని క్యాంప్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారన్నారు.