KDP: జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాజంపేటలో సీఐ నాగార్జున ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్, అత్యవసర హెల్ప్లైన్ నంబర్ల వినియోగంపై మహిళలకు వివరించారు. పోలీసులు తక్షణ స్పందన అందిస్తారని తెలిపారు. పాత బస్ స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.