SS: రాప్తాడు, హిందూపురం, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎంపీ బీకే పార్థసారథి అందజేశారు. మొత్తం రూ. 14,20,003 విలువైన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనారోగ్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేదలకు ఈ నిధి ఎంతో ఊరట కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.