ప్రకాశం: హనుమంతునిపాడు మండలం ఉమ్మలపల్లి కొత్తూరులో సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో నూతన పంచలోహ విగ్రహాలకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.