కృష్ణా: పామర్రు టీడీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొమరవోలుకి చెందిన బేబీ ఆఫ్ కోవలి శృతికి రూ.90,306ల విలువైన చెక్కును MLA వర్ల కుమార్ రాజా అందించారు. ప్రజల అవసరాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తామని MLA తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.