SKLM: ఆమదాలవలస మండలం అక్కుల పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత పై ఆయన సమీక్షించారు. వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు మీనా కుమారి, వసంత పాల్గొన్నారు.