KRNL: మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్ఛార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి భూమిపూజ చేసి గురువారం ప్రారంభించారు. సాతనూరు, ఆగుసునూరు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.2 కోట్లు, కందుకూరు క్రాస్ నుంచి తుంబిగనూరు వరకు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.