TPT: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మట్టం శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. ఆమె ఇప్పటివరకు టీడీపీ తెలుగు మహిళ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటులో భాగంగా శ్రావణి రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అధిష్టానం నియమించడం జరిగింది. ఈ మేరకు పలువురు ఆమెను అభినందించారు.