అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఎం.ఎస్ నెం. 43ను విడుదల చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. జర్నలిస్టులు రూ.1,250 ప్రీమియం చెల్లించగా, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని భరిస్తుంది. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించనుంది.