బాపట్ల: సూర్యలంకలోని 15 మంది గజ ఈతగాళ్లకు అడవి గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. నిధుల లేమితో జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది. సముద్రంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన తమ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ఈతగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఉద్యోగాలు తీసేస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.