ELR: అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి కామవరపుకోట మండలం తడికలపూడిలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు.