KDP: బద్వేల్ నియోజకవర్గం కాశినాయన(M) బసనపల్లికి చెందిన స్వరూప ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ పలితాల్లో 452 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆమె పదో తరగతిలో 596 మార్కులు సాధించింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన స్వరూప ఈ విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఆమె ప్రతిభను కొనియాడింది.