NDL: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఈశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మహానందిలో నూతనంగా నిర్మించిన కమ్మవారి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో భవనం నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.