సత్యసాయి: పుట్టపర్తిలో విషు వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మశ్రీ డాక్టర్ జి. శంకర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన సుశీల బృందం ‘సప్త వీణ’ వాయిద్య కచేరీతో అలరించారు. సాయి గాయత్రితో మొదలైన కచేరీలో మహా గణపతిం, హరివరాసనం వంటి కీర్తనలను ఏడు వీణల సమన్వయంతో అద్భుతంగా పలికించారు. ఈ ప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది.