కోనసీమ: అల్లవరం మండలం గోడిలంక గ్రామంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (55) సైకిల్పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.