ప్రకాశం: గిద్దలూరు వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపి నాగార్జున రెడ్డిని రాచర్ల నాయకులు గురువారం మార్కాపురంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న జరగనున్న శ్రీ గంగమ్మ తల్లి పోతురాజు దేవస్థానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు గ్రామ నాయకులు వెల్లడించారు.