KRNL: మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొలేరో డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగిందని వారు వివరించారు. నిద్ర మత్తులో కుడి సైడ్ వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు వెల్లడించారు. సదరు వాహనానికి పర్మిట్ లేదన్నారు.