కృష్ణా: మచిలీపట్నంలో వివిధ పోలీస్ స్టేషన్లను ఐజీపీ అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళలపై దాడుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. ఎస్పీ పి. విద్యాసాగర్ నేతృత్వంలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. రౌడీషీటర్లపై స్పెషల్ నిఘా కొనసాగుతోందని ఐజీపీ స్పష్టం చేశారు.